ఇది చాలా మందికి కావలసిన సమాచారం సేకరించి పెట్టాను:
ఫలాలు - నైవేద్యాలు - ఫలితాలు
ఫలాలు - నైవేద్యాలు - ఫలితాలు
- కమలాపండు - ఆగిపోయిన పనులు పూర్తవుతాయి
- అరటి పండు - మనసులోని కోరికలు తీరుతాయి
- అరటి గుజ్జు - అప్పుల బాధ తీరుతుంది
- సపోటా పండు - పనులు విజయవంతంగా పూర్తవుతాయి
- కొబ్బరి - పనులు త్వరగా పూర్తవుతాయి
- మామిడి - ప్రభుత్వం నుండి కావలసిన పనులు, డబ్బు బకాయిలు తీరుతాయి
- అంజీర - అనారోగ్యం తగ్గుతుంది (వినాయకుడికి నైవేద్యం పెట్టాలి)
- నేరేడు పండు - మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి (శనికి), దానం చేస్తే శని వల్ల కలిగే నష్టాలు తొలగుతాయి
- పనస పండు - శత్రుబాధలు, కష్టాలు తొలగుతాయి
- ఆపిల్ పండు - జాతక దోషాలు పోతాయి, ఐశ్వరయం లభిస్తుంది
- ద్రాక్ష పండు - పక్షవాతం తగ్గుతుంది
- జామ పండు - షుగర్ వ్యాధి తగ్గుతుంది, దానం చేస్తే వివాహం జరుగుతుంది
- సంకష్ట హర చతుర్ధి నాడు గణపతి కి నైవేద్యం పెడితే ఆరోగ్యం వృద్ధి అవుతుంది. పిల్లలకు మానసిక వ్యాధి తగ్గుతుంది.
- పులిహోర ప్రసాదంగా గుడిలో శుక్రవారం అమ్మవారి గుడిలో పంచితే వివాహం జరుగుతుంది. మిగితా రోజులలో దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది
- పెసర పప్పు పొంగలి - సుభ్రమణ్య స్వామికి మంగళవారం నైవేద్యం పెడితే కుటుంబ కలహాలు పోతాయి
- పెసర పప్పు పొంగలి - గణపతి కి పెడితే పనులు త్వరగా అవుతాయి
- పెసర పప్పు పొంగలి - సత్యనారాయణ స్వామికి పెడితే మానసిక శారీరిక సమస్యలు పోతాయి
- పెసర పప్పు పొంగలి - సరస్వతి కి పెడితే పిల్లల జ్ఞాపకశక్తి పెరుగుతుంది
- పెసర పప్పు పొంగలి - బుధుడు బాగులేనప్పుడు పెడితే నరాల వ్యాధులు తగ్గుతాయి
- పెరుగన్నం (దద్దోజనం) నైవేద్యం -
- శనివారం ఇలావేల్పుకి పెడితే అప్పుల బాధ తీరుతుంది
- శుక్రవారం సాయంత్రం లక్ష్మి దేవికి పెడితే ధనవృద్ధి, దానిమ్మగింజలతో పెడితే శత్రుబాధాలు పోతాయి
- తేనే వేసి లక్ష్మి, విష్ణు సహస్ర నామాలు చదివి నైవేద్యం చేసి తింటే దీర్ఘకాలిక రోగాలు పోతాయి
- మిరియాల పొడి వేసి, సుభ్రమణ్య స్వామికి పెడితే చర్మవ్యాధులు పోతాయి
- ఎండు ఖర్జూరాలు కలిపి కులదేవతకు పెడితే ఆర్ధిక సమస్యలు పోతాయి
- అతుకుల నైవేద్యం -
- అటుకులు, తేనే, బెల్లం, అరటి పండు కలిపి శివ పార్వతులకు నైవేద్యం పెట్టి పెళ్లి కాని వారికి పెట్టాలి (సోమవారం) వివాహం జరుగుతుంది
- అటుకులు, కొబ్బరి, తేనే కలిపి కృష్ణుడికి సాయంత్రం నైవేద్యం పెట్టి పిల్లలకు పంచాలి
- అటుకులు తేనే మంగళ శుక్రవారాలలో లక్ష్మి నారాయణులకు నైవేద్యం పెడితే ధనం నిల్వ ఉండి అప్పుల బాధ తీరుతుంది
- గురువారం నాడు అటుకులతో చేసిన పదార్ధం (పులిహోర) గురువులకు పెట్టడం వల్ల గురు దోషాలు పోతాయి, ఆరోగ్య సమస్యలు పోతాయి, సంతాన ప్రాప్తి
- బుధవారం విష్ణు, లక్ష్మి సహస్రం చేసి పాలతో కలిపినా అటుకులు నైవేద్యం పెడితే చాలా పనులు పూర్తవుతాయి, ఆరోగ్యం, ధనం బాగుంటాయి